‘పాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి’

ABN , First Publish Date - 2021-05-07T06:02:58+05:30 IST

చర్చిల్లో పని చేసే పాస్టర్‌లకు గౌరవ వేతనం కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్‌ బాషా ఓ ప్రకటనలో తెలిపారు.

‘పాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి’

కర్నూలు(కలెక్టరేట్‌), మే 6: చర్చిల్లో పని చేసే పాస్టర్‌లకు గౌరవ వేతనం కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహబూబ్‌ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన పాస్టర్లు ఈ నెల 11వ తేదీలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో నవశకం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకానికి కొన్ని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం విధించిందన్నారు. చర్చి స్థలం చేర్చి సొసైటీ చట్టం కింద నమోదు చేసి ఉండాలన్నారు. ఇలాంటి నియమాలను పాటిస్తూ పాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

Updated Date - 2021-05-07T06:02:58+05:30 IST