టీఆర్‌టీ అభ్యర్థులకు నియామకపత్రాలు

ABN , First Publish Date - 2020-10-16T07:21:48+05:30 IST

టీఆర్‌టీ నియామకాల్లో భా గంగా వికలాంగుల కోటాలో ఎస్టీజీ ఉర్దూ మీడియం, ఎస్‌ఏ బయోసైన్స్‌ తెలుగు

టీఆర్‌టీ అభ్యర్థులకు నియామకపత్రాలు

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 15: టీఆర్‌టీ నియామకాల్లో భా గంగా వికలాంగుల కోటాలో ఎస్టీజీ ఉర్దూ మీడియం, ఎస్‌ఏ బయోసైన్స్‌ తెలుగు మీడియం పోస్టులకు గాను గురువారం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. నిజామాబాద్‌ డీఈవో దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ లత, కామారెడ్డి విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి గంగాకిషన్‌ తదితరులు అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.


అనంతరం జిల్లాపరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, జడ్పీ సీఈవో గోవింద్‌ తదితరులు అభ్యర్థులకు పోస్టింగ్‌ ఆర్డర్‌లు ఇచ్చారు. ఎస్‌ఏ బయోసైన్స్‌లో అంజనకు జడ్పీహెచ్‌ఎస్‌ పెద్దకోడప్‌గల్‌  పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వగా, ఎస్జీటీలో షమీమ్‌ బేగం ఉర్దూ మీడియం జీపీఎస్‌ అడ్లూర్‌లో, రూబినా బేగంకు ఎంపీయూపీఎస్‌ ఉర్దూ మీడియం పిట్లం పాఠశాలలో పోస్టింగ్‌ ఇచ్చారు. అఫ్రీన్‌ బేగంకు ఉర్దూ మీడియం ఎంపీపీఎస్‌ మద్నూర్‌లో, నహీద్‌ సుల్తానాకు ఉర్దూ మీడియం ఎంపీపీఎస్‌ హస్గుల్‌ పోస్టింగ్‌లు ఇచ్చారు.

Updated Date - 2020-10-16T07:21:48+05:30 IST