MahanadUలో నాలుగు తీర్మానాలపై ఆమోదం
ABN , First Publish Date - 2022-05-27T21:03:23+05:30 IST
మహానాడులో టీడీపీ నేతలు వరుసగా తీర్మానాలను ప్రవేశపెడుతోన్నారు.ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలపై చర్చించారు.
అమరావతి: మహానాడులో టీడీపీ నేతలు వరుసగా తీర్మానాలను ప్రవేశపెడుతోన్నారు.ఇప్పటి వరకు నాలుగు తీర్మానాలపై చర్చించారు. కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది. కష్టాల కడలిలో సేద్యం.. దగాపడుతున్న రైతన్న అంశంపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.