4 నుంచి రెండు ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-23T19:47:54+05:30 IST

జిల్లా వాసులకు మరో రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి హొసపేట నుంచి రెండు జనరల్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో

4 నుంచి రెండు ప్యాసింజర్‌ రైళ్లు ప్రారంభం

బళ్లారి(కర్ణాటక): జిల్లా వాసులకు మరో రెండు రైళ్లు  అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి హొసపేట నుంచి రెండు జనరల్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో హొసపేట-దావణగెర-హరిహర(రైలు నెం 07395) ప్రతి రోజు ఉదయం 9.40గంటలకు  హొసపేట రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమై హగరి బొమ్మనహళ్ళి కొట్టూరు మీదుగా 1.30 గంటలకు దావణగెర నగరానికి చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి హరిహరకు చేరుతుంది. అక్కడి నుంచి రైలు నెం 07396 గల రైలు ఆదేమార్గం గుండా మద్యాహ్నం 3గంటలకు బయలు దేరి రాత్రి 8గంటలకు హొసపేట పట్టణానికి చేరుకుంటుంది. హొసపేట నుంచి రైలు నెం 07397 నెంబరు గల రైలు ఉదయం 6గంటలకు హొసపేట నుంచి బయలుదేరి 7.40గంటలకు బళ్ళారికి చేరుకుంటుందని, అదే సమయానికి బళ్ళారి నుంచి రైతు నెం 07398 నెంబరు గల రైలు బళ్ళారి రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమై హొసపేటకు చేరనుంది. ఈ రెండు రైళ్ళలో టిక్కెట్టె సామాన్య ధర నిర్ణయించారు. నైరుతి రైల్వే విభాగం తీసుకున్న నిర్ణయం పట్ల విజయనగర రైల్వే అభివృద్ధి క్రియా సమితి అధ్యక్షుడు వై.యమునేష్‌, కార్యదర్శి మహేష్‌, కుడితిని హర్షం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి డిమాండ్‌ను రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2022-03-23T19:47:54+05:30 IST