పాత్రికేయ వృత్తి గౌరవాన్ని పెంచుతాం

ABN , First Publish Date - 2022-08-18T05:37:33+05:30 IST

పాత్రికేయుల హక్కుల పోరాటంతో పాటు, మీడియా ప్రమాణాలను మెరుగుపరిచి వృత్తి గౌరవాన్ని పెంపొందిం చేందుకు ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని ఐజేయూ కార్యవర్గ సభ్యుడు దూసనపూడి సోమసుందర్‌ అన్నారు.

పాత్రికేయ వృత్తి గౌరవాన్ని పెంచుతాం
తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు బహుమతుల పంపిణీ

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 17: పాత్రికేయుల హక్కుల పోరాటంతో పాటు, మీడియా ప్రమాణాలను మెరుగుపరిచి వృత్తి గౌరవాన్ని పెంపొందిం చేందుకు ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని ఐజేయూ కార్యవర్గ సభ్యుడు దూసనపూడి సోమసుందర్‌ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే 65వ ఆవిర్భావ వేడుకలు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ అధ్యక్షతన తాపీ వర్కర్స్‌ భవనంలో బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. ప్రెస్‌క్లబ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వానపల్లి సుబ్బారా వును  సత్కరించారు. గజపతి వరప్రసాద్‌, యడ్లపల్లి మురళి, మైలవరపు రవికిరణ్‌, వెంకటరత్నం, కె.ఆశీర్వాదం, పి.మురళి, తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం: నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దీర్ఘకాలంగా పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలతో పాటు అర్హులైన వారికి అక్రిటి డేషన్‌, బస్సు పాస్‌లు ఇవ్వాలని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఏవోకు ప్రెస్‌క్లబ్‌ తరుపున వినతిపత్రం అందించారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. పండా త్రినాథ్‌, ఇజ్రాయిల్‌, మారుతి, సూర్యనారాయణ, చిన్నారావు, వెంకటేశ్వరావు, రంగ, సందీఫ్‌, ఇంటి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:37:33+05:30 IST