సీఎం దృష్టికి ఆక్వా సమస్యలు : ఎమ్మెల్యే గ్రంధి

ABN , First Publish Date - 2020-11-27T04:51:44+05:30 IST

ఆక్వా రంగ సమస్యలు, ఆక్వా ఎగుమతిదారుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.

సీఎం దృష్టికి ఆక్వా సమస్యలు : ఎమ్మెల్యే గ్రంధి

భీమవరం టౌన్‌, నవంబరు 26 : ఆక్వా రంగ సమస్యలు, ఆక్వా ఎగుమతిదారుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. క్యాంపు కార్యాయలంలో గురువారం ఆక్వా పరిశ్రమల యజమానులు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ను కలసి సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రైతుల నుంచి రొయ్యలను కొనుగోలు చేశారని, ఆ సమయంలో ఎగుమతుల విషయంలో కూడా ఇబ్బందులు పడ్డారన్నారు. భీమవరం ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఆక్వా రంగంపై ఆధారపడి ఉన్నారని, ఆక్వా రైతుల పరిశ్రమల యాజమాన్యాల ఇబ్బం దులను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. సమావే శంలో ఆనంద్‌, ఇర్రింకి సూర్యారావు, తోట జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:51:44+05:30 IST