ఆక్వా రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి : లంక

ABN , First Publish Date - 2021-04-24T04:53:46+05:30 IST

ఆక్వా రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతు కార్యాచరణ సమితి కార్యదర్శి లంక కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమా ండ్‌ చేశారు.

ఆక్వా రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి : లంక

భీమవరం, ఏప్రిల్‌ 23 : ఆక్వా రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతు కార్యాచరణ సమితి కార్యదర్శి లంక కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమా ండ్‌ చేశారు. భీమవరం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అగ్రగామి కిసాన్‌ సభ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆక్వా రంగం పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై మాట్లాడారు. గత సంవత్సరం కరోనా వల్ల రైతులు నష్టపోయారని, ఈ సంవత్సరం కూడా మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రైతు నాయకులు కనుమూరి వెంకటపతిరాజు, దండు శ్రీనివాసరాజు, తిరుమాని వనమరాజు, రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T04:53:46+05:30 IST