ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-07-06T10:04:24+05:30 IST

ప్రజారోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

అరకు ఎంపీ  గొడ్డేటి మాధవి


కొయ్యూరు, జూలై 5: ప్రజారోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. ఆదివారం కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాలకు చెందిన 108, 104 వాహనాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ మండలానికి రెండు చొప్పున 108, 104 వాహనాలను కేటాయించాలని కోరనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు డివిజనల్‌ మేనేజర్‌ రుత్తల శ్రీనివాసరావు, రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారిణి శ్యామల, ఆరోగ్యశ్రీ ఈఎంటీ రాజారావు, నేతలు వారా నూకరాజు, గొడ్డేటి మహేశ్‌, బడుగు రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ అప్పన గజ్జియ్యదొర, రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T10:04:24+05:30 IST