చెన్నకేశవస్వామి ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలాచార్యులు మృతి

ABN , First Publish Date - 2021-04-22T05:47:32+05:30 IST

మా ర్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నంద్యాల తిరుమలాచార్యులు (63) బుధవారం మృతి చెందారు.

చెన్నకేశవస్వామి ఆలయ ప్రధాన అర్చకులు   తిరుమలాచార్యులు మృతి


మార్కాపురం (వన్‌టౌన్‌) ఏప్రిల్‌ 21: మా ర్కాపురం పట్టణంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నంద్యాల తిరుమలాచార్యులు (63) బుధవారం మృతి చెందారు. అనారోగ్య సమస్యతో గత 3 రోజులుగా ఒంగోలులో ఆయన చి కిత్స పొం దుతూ మృతి చెందారు. ఎర్రగొండపాలెం కు చెందిన నంద్యాల తిరుమలాచార్యులు గత 30 సంవత్సరాలుగా అర్చక విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తిరుమలాచార్యులు మృతి పట్ల ఎమ్మెల్యే  నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు  జంకె వెంకటరెడ్డి, కె.పి.కొండారెడ్డి, కందుల నారాయణరెడ్డిలతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి, అర్చకులు, అర్చక సంఘా లు, వివిధ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-04-22T05:47:32+05:30 IST