వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-03-22T23:24:03+05:30 IST

వరి ధాన్యం విషయంలో బీజేపీ నేతల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు

వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: వరి ధాన్యం విషయంలో బీజేపీ నేతల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఆమె పోస్ట్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై దేశమంతా ఒకే విధానం మాత్రమే ఉండాలని నిన్న కేసీఆర్ అన్నారని ఆమె పేర్కొన్నారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదన్నారు. కేంద్రం పంజాబ్‌లో వడ్లు 100% కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 



Updated Date - 2022-03-22T23:24:03+05:30 IST