కేంద్రం మంజూరు చేస్తున్న నిధులపై చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2022-06-25T06:52:27+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేం ద్రప్రభుత్వం రాష్ర్టానికి మంజూరు చేసిన నిధులపై చర్చించడానికి గోల్కొండ, భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద చర్చకు సిద్ధమేనా అని బీ జేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సవాల్‌ విసిరారు.

కేంద్రం మంజూరు చేస్తున్న నిధులపై చర్చకు సిద్ధమా?
సమావేశంలో మాట్లాడుతున్న రాణిరుద్రమ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ 

మర్రిగూడ, జూన 24:  మంత్రి కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేం ద్రప్రభుత్వం రాష్ర్టానికి మంజూరు చేసిన నిధులపై చర్చించడానికి గోల్కొండ, భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద చర్చకు సిద్ధమేనా అని బీ జేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సవాల్‌ విసిరారు. శు క్రవారం మర్రిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ సన్నాహాక సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రప్రభు త్వం రాష్ర్టానికి ఏ నిధులు మంజూరు చేయలేదని మంత్రి కేటీఆర్‌ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ర్టాభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలతో పాటు ని ధులను మంజూరు చేసినా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంపూర్ణంగా అందించడం లేదని పేర్కొన్నారు. జూలై 2, 3వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములుగౌడ్‌, నాయకులు పిట్టెల శ్రీనివాస్‌, ఏరెడ్ల శ్రీనివాసరెడ్డి, యాస అమరేందర్‌రెడ్డి, పరశురాం, రాజేందర్‌, రాజు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-06-25T06:52:27+05:30 IST