ముంబైకి టాటా.. గోవాకు జై!

ABN , First Publish Date - 2022-08-12T09:24:43+05:30 IST

సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ముంబై జట్టుకు టాటా చెప్పనున్నాడు.

ముంబైకి టాటా.. గోవాకు జై!

ముంబై: సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ముంబై జట్టుకు టాటా చెప్పనున్నాడు. వచ్చే దేశవాళీ సీజన్‌ నుంచి అతను గోవా టీమ్‌కు ఆడాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కోసం ముంబై క్రికెట్‌ సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. 22 ఏళ్ల అర్జున్‌ 2020-21 సీజన్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అలాగే ఈ సీజన్‌లో జట్టు నుంచి కూడా తప్పించారు. ముంబై జట్టులో నెలకొన్న విపరీత పోటీ మధ్య ఈ లెఫ్టామ్‌ పేసర్‌కు సరైన అవకాశాలు రావడం లేదు. దీంతో జట్టు మారడమే సరైన నిర్ణయంగా భావిస్తున్నాడు. అటు గోవా జట్టు కూడా లెఫ్టామ్‌ పేసర్‌ కోసం చూస్తోందని ఆ రాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సూరజ్‌ తెలిపాడు.

Updated Date - 2022-08-12T09:24:43+05:30 IST