నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2022-06-28T06:37:42+05:30 IST

నేరాల నియంత్రనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రా మంలో రూ.8లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఆమె సోమవారం ప్రారంభించారు.

నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రెమా రాజేశ్వరి

ఎస్పీ రెమా రాజేశ్వరి

మిర్యాలగూడ రూరల్‌, జూన్‌ 27: నేరాల నియంత్రనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రా మంలో రూ.8లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చన్నారు. జిల్లా మొత్తాన్ని సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ భిక్షంగౌడ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, చిట్టిబాబునాయక్‌, మార్కెట్‌ మాజీ డైరెక్టర్‌ పులి జగదీష్‌, పార్టీ మండల అధ్యక్షుడు మట్టపల్లి సైదయ్యయాదవ్‌, నాయకులు గడడోజు ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:37:42+05:30 IST