పగడ్బందీగా కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-05-09T05:32:08+05:30 IST
కర్ఫ్యూను పకడ్బందీగా నిర్వహించాలని డీఎస్పీ శివరామి రెడ్డి కోరారు. శనివారం సోంపేటలో కర్ఫ్యూను పరిశీలించి సి బ్బందికి పలు సూచనలు చేశారు.
సోంపేట: కర్ఫ్యూను పకడ్బందీగా నిర్వహించాలని డీఎస్పీ శివరామి రెడ్డి కోరారు. శనివారం సోంపేటలో కర్ఫ్యూను పరిశీలించి సి బ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ డీవీవీ సతీష్, ఎస్ఐ వెం కటేష్ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురంలో కర్ఫ్యూను సీఐ ఎం.వినోద్బాబు, పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పరిశీలించారు. తహసీల్దార్ మురళీమోహన్రావు రోడ్డుపైన వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. పాలకొండ రూరల్: కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తేచర్యలు తప్పవని ఎస్ఐ ప్రసాద్ హెచ్చరించారు. శనివారం పాలకొండలో మధ్యాహ్నం 12 తర్వాత రోడ్డుపైకి వచ్చిన వాహన చోదకులకు అపరాధ రుసుం విధించారు. కంచిలి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించామని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని రేఖాదేవిపురం వద్ద సరిహద్దు చెక్పోస్టును పరిశీలించారు. కొవిడ్ నేపద్యంలో ఒడిశా నుంచి వచ్చే వాహనాలు పరిశీలిస్తున్నామ ని తెలి పారు. ఆయన వెంట సీఐ డీవీవీ సతీష్కుమార్, ఎస్ఐ దుర్గాప్రసాద్ ఉన్నారు. ఫ కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఇంటింటా జ్వరాలపై సర్వేను పక్కాగా నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ఎన్.వెంకటరావు తెలిపారు. కంచిలిలో ఎస్ఐతో కలిసి కర్ఫ్యూను పరి శీలించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ కంచిలి తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని, కరోనా సమాచారాన్ని గ్రామాల నుంచి 7396988790 నెంబరుకు అందించాలని తెలిపారు.