అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-09T04:51:12+05:30 IST

మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న విష యం ఆదివారం రాత్రి తెలిసింది. కుటుంబ సభ్యులు, స్థాని కులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో  ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య

అమరచింత, మార్చి 8: మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న విష యం ఆదివారం రాత్రి తెలిసింది. కుటుంబ సభ్యులు, స్థాని కులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రానికి చెందిన గొల్లబాబు, మాస మ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారు డైన రజనీ కుమార్‌(23) అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రజనీకుమార్‌ ఆదివా రం రాత్రి  తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి అరుణాచల్‌ ప్రదేశ్‌లో ని వేరే యూనిట్‌కు పంపుతున్నారని, తనకు కడుపులో కొద్దిగా నొప్పిగా ఉందని ఏడుస్తూ మాట్లా డినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సోమవారం ఉదయం వేళ ఆర్మీ అధికారులు ఫోన్‌ చేసి రజనీకుమార్‌ ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మరణ వార్త వినడంతో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆర్మీ అధికారుల పద్ధతి ప్రకారం రజనీకుమార్‌ భౌతిక కాయాన్ని  మంగళవారం అమరచింతకు తీసుకువస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-09T04:51:12+05:30 IST