భార్యపై కేసు పెట్టిన ఓ ఆర్మీ జవాన్.. ఆమె నిర్వాకమేంటో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు.. శునకాలకు ఫొటోలు తీసి..

ABN , First Publish Date - 2022-06-06T17:16:14+05:30 IST

తన భార్య ప్రవర్తనకు మనస్తాపం చెందిన ఒక...

భార్యపై కేసు పెట్టిన ఓ ఆర్మీ జవాన్.. ఆమె నిర్వాకమేంటో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు.. శునకాలకు ఫొటోలు తీసి..

2022 జనవరి 18న అతని భార్య గేదెలు, బంగారు, వెండి ఆభరణాలు అపహరించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ గేదెలను స్వాధీనం చేసుకున్నారు. నగలు ఇంకా రికవరీ కాలేదు. అయితే అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా భటుండి అనే మరో గ్రామంలో ఉంటోంది. అప్పటి నుంచి ఆమె భర్తను వేధిస్తోంది. ఫొటోలలో అతని ముఖం ప్లేస్‌లో కుక్క ముఖచిత్రాన్ని ఉంచి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిని అవమానంగా భావించిన ఆ జవాను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వారిద్దరికీ 2020 జూలై 30న వివాహమైందని పోలీసులు తెలిపారు. 




తన భార్య ప్రవర్తనకు మనస్తాపం చెందిన ఒక ఆర్మీ జవాన్ పోలీసులను ఆశ్రయించాడు. భార్య తన ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నదని ఆరోపించాడు. ఈ ఫోటోల్లో అతని ముఖం ఉండాల్సిన ప్లేస్‌లో కుక్క ముఖం జత చేయడం కనిపిస్తోంది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం అజ్మీర్ జిల్లాలోని మంగ్లియావాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భీంపుర నివాసి అయిన మునవ్వర్ ఖాన్ ఇండియన్ ఆర్మీలో సైనికునిగా విధులు నిర్వహిస్తున్నాడు.

Updated Date - 2022-06-06T17:16:14+05:30 IST