ఆర్మీ ర్యాలీకి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-13T06:49:53+05:30 IST

వన్‌టౌన్‌లో ఇందిరాప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆర్మీ అగ్నిపథ్‌ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు శనివారం సాయంత్రం నుంచి వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు.

ఆర్మీ ర్యాలీకి ఏర్పాట్లు
బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు

నేటి అర్ధరాత్రి నుంచి ఎంపికకు శ్రీకారం

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వన్‌టౌన్‌లో ఇందిరాప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆర్మీ అగ్నిపథ్‌ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు శనివారం సాయంత్రం నుంచి వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు. అడ్మిట్‌ కార్డు ద్వారా లోపలకు అనుమతించిన అభ్యర్థులను బృందాలుగా చేసి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన బాక్సుల్లోకి పంపిస్తారు. అర్ధరాత్రి ఒంటి గంట తరువాత ర్యాలీ ప్రారంభం కానున్నది. తొలి రోజు నాలుగు వేల మంది అభ్యర్థులు రానున్నారు. ఆదివారం నుంచి రోజుకు ఐదువేల మంది వరకు హాజరవుతారని అంచనా. అభ్యర్థులను స్టేడియంకు పడమర వైపు రోడ్డు నుంచి లోపలకు అనుమతించనున్నారు. ర్యాలీ కోసం అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో ర్యాలీకి అవసరమైన బారికేడ్లు, బాక్సులను రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేసిందని డీఈ ఫణి తెలిపారు. 

బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

ఆర్మీ నియామక ర్యాలీ బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ పరిశీలించారు. ఈ ర్యాలీ సవ్యంగా నిర్వహించేందుకు 450 మందితో బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి రోజు 2700 మంది అభ్యర్థులు పాల్గొంటారని తెలిపారు.


Updated Date - 2022-08-13T06:49:53+05:30 IST