ఏబీవీపీ నాయకుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-03T22:40:03+05:30 IST
నగరంలోని ఏబీవీపీ విద్యార్థి నాయకులను ముందస్తుగా
నెల్లూరు: నగరంలోని ఏబీవీపీ విద్యార్థి నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ టూర్ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని వాహనాల్లో ఎక్కించుకుని వివిధ పీఎస్లకు తిప్పుతున్నారు. నెల్లూరు నుంచి మైపాడు, అక్కడి నుంచి ఇందుకూరుపేట పీఎస్కు తరలించారు. సీఎం జగన్ కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే సాకుతో అరెస్టులు చేశారు. నాయకుల అరెస్టులపై విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.