హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2021-03-10T01:50:49+05:30 IST
సీపీఎం నాయకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను
పెద్దపల్లి: సీపీఎం నాయకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5న గోదావరిఖనిలోని ప్రశాంత్నగర్లో సీపీఎం నాయకుడు మెగిలిని నిందితులు హత్య చేశారు. భూ వివాదం కారణంగానే ఈ హత్య చేశారు. విచారణ ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక కారును, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.