ఏటీఎం దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-10T01:25:10+05:30 IST
జిల్లాలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను
కర్నూలు: జిల్లాలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ఆగస్టు నెలలో డోన్ పట్టణంలో సుందర్ సింగ్ కాలనీలోని ఏటీఎంలో 65 ,61,900/- రూపాయల దొంగతనం కేసులో దొంగలను పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నారు. వారిలో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసారు. వారి నుంచి 6,25,000 వేల రూపాయలను పోలీసులు రికవరీ చేసారు. మిగితా ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.