మావోయిస్టులకు నగదును తీసుకు వెళ్తున్న వ్యక్తుల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-15T23:19:24+05:30 IST

మావోయిస్టులకు నగదును తీసుకు వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు

మావోయిస్టులకు నగదును తీసుకు వెళ్తున్న వ్యక్తుల అరెస్టు

రాజమండ్రి:  మావోయిస్టులకు నగదును తీసుకు వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గొర్లగూడెం గ్రామం వద్ద పక్కా సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చింతూరు పోలీసులు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రూపాయల నగదుతో పాటు, 3 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఘటన‌పై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చింతూరు డీఎస్పీ ఖాదర్ బాషా వెల్లడించారు. 

Updated Date - 2021-06-15T23:19:24+05:30 IST