పేకాటరాయుళ్ల అరెస్టు - రూ.40 వేలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-18T06:15:22+05:30 IST

మండలంలోని కట్టకిందపల్లిలో పేకాట స్థావరం పై శనివారం దాడులు చేసి, తొమ్మిదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ శ్యామరావు పే ర్కొన్నారు.

పేకాటరాయుళ్ల అరెస్టు - రూ.40 వేలు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న నగదు చూపుతున్న సీఐ శ్యామరావు

పామిడి, ఏప్రిల్‌ 17: మండలంలోని కట్టకిందపల్లిలో పేకాట స్థావరం పై శనివారం దాడులు చేసి, తొమ్మిదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు సీఐ శ్యామరావు పే ర్కొన్నారు. స్థానిక పోలీసు స్టేషనలో శనివారం ఆయ న విలేకరులకు వివరాలు వెల్లడించారు. గ్రామ సమీపంలోని ఈతవనంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మే రకు సీఐ శ్యామరావు, ఎస్‌ఐ గంగాధర్‌ సిబ్బందితో దాడి చేశారు. పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్దనుంచి రూ.40,115 నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎ్‌సఐ వలి, వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ, కానిస్టేబుళ్లు జ యచంద్రనాయుడు, ఎర్రిస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:15:22+05:30 IST