విద్యార్థి సంఘం నాయకుల అరెస్టు

ABN , First Publish Date - 2022-09-24T06:43:25+05:30 IST

విద్యార్థి సంఘం నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

విద్యార్థి సంఘం నాయకుల అరెస్టు

ఆదోని, సెప్టెంబరు 23: విద్యార్థి సంఘం నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని టిడ్కో ఇళ్లను ప్రారంభోత్సవానికి పుర పాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వస్తున్నట్లు తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అఽధ్యక్షులు శ్రీనివాసులు, శ్రీకాంత్‌, వీరేష్‌లు అక్కడికి చేరుకున్నారు. అవకాశం ఉంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించాలనుకున్నారు ఈలోగా వన్‌ టౌన్‌ సీఐ విక్రమ సింహ వారిని చూసిన వెంటనే తన సిబ్బందితో జీపులోకి కుక్కారు. తా ము ఇళ్లు పంపిణీ చేసేది చూసేందుకు వచ్చామని తెలిపినా వినిపిం చుకోకుండా అదుపులోకి తీసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు.

Updated Date - 2022-09-24T06:43:25+05:30 IST