ముగ్గురు నేరస్థుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-11T00:57:26+05:30 IST
నగరంలో పేరు మోసిన ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు
దుండిగల్: నగరంలో పేరు మోసిన ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన ముందస్తు సమాచారంతో నేరస్థులను పోలీసులు పట్టుకున్నారు. ఒక రహస్య సమాచారం మేరకు బౌరంపేట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు ముగ్గురు వ్యక్తులను దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రాత్రి పూట సీసీ కెమెరాలు లేని చోట తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న దొంగలుగా విచారణలో వారిని పో్లీసులు గుర్తించారు.
నిందితులను రోడా మేస్రీ నగర్కి చెందిన నగుల్వార్ దుర్గేష్, కాంబ్లే గణేష్, గండి మైసమ్మకు చెందిన నాగలవాడ రాజులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి నగదు, వస్తువుల విలువ 5,00,000/- ఐదు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.