కంగనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు

ABN , First Publish Date - 2021-03-02T00:18:25+05:30 IST

బాలీవుడ్ నటి కంగన రనౌగ్‌పై ముంబై హైకోర్టు సోమవారం బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ జావేద్ అక్తర్ నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఈ వారెంట్ జారీ చేసినట్లు కోర్టు వెల్లడించింది. కంగన రనౌత్‌పై..

కంగనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు

ముంబై: బాలీవుడ్ నటి కంగన రనౌగ్‌పై ముంబై హైకోర్టు సోమవారం బెయిలబుల్ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ జావేద్ అక్తర్ నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఈ వారెంట్ జారీ చేసినట్లు కోర్టు వెల్లడించింది. కంగన రనౌత్‌పై జావేద్ అక్తర్ కొద్ది నెలల క్రితం పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును గత నెల 1న విచారించిన అంధేరీలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ మార్చి 1వ తేదీలోగా కోర్టు ముందు హాజరు కావాలని కంగనను ఆదేశించింది. కానీ సోమవారంతో గడువు ముగిసినప్పటికీ కంగన హాజరు కాలేదు. దీంతో ఆమె చర్యను కోర్టు ధిక్కరణగా భావించిన న్యాయస్థానం.. ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే ఈ వారెంట్‌ బెయిలబుల్ వారెంట్ అని ధర్మాసనం పేర్కొంది. 


అంతేకాకుండా తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. కాగా.. అరెస్టు వారెంటు జారీ చేయడంపై కంగన తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్దికీ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఆదేశాలపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే జావేద్ అక్తర్ తరపు న్యాయవాది వ్రిందా గ్రోవర్ కూడా దీనిపై స్పందించాడు. 


ఒకవేళ పై కోర్టుకు వెళ్లినప్పటికీ కంగన కచ్చితంగా కోర్టు ముందు హాజరు కావడం నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఇదిలా ఉంటే కంగనపై జావేద్ అక్తర్ గతేడాది నవంబరులో పరువు నష్టం దావా వేశారు. తనపై కంగన రనౌత్ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేశారని, దానివల్ల తన పరపతి దెబ్బతిన్నదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2021-03-02T00:18:25+05:30 IST