27న సీఎం జగన్‌ రాక

ABN , First Publish Date - 2022-06-22T05:03:44+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 27న జిల్లాకు రానున్నారు. అమ్మఒడి మూడోవిడత పథకాన్ని శ్రీకాకుళం నుంచే ప్రారంభించనున్నారు. నగరంలోని కేఆర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది.

27న సీఎం జగన్‌ రాక
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ రఘురాం, కలెక్టర్‌, ఎస్పీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, జూన్‌ 21: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈనెల 27న జిల్లాకు రానున్నారు. అమ్మఒడి మూడోవిడత పథకాన్ని శ్రీకాకుళం నుంచే ప్రారంభించనున్నారు. నగరంలోని కేఆర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ వద్దకు సీఎం చేరుకుంటారు. అంతకుముందు శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని  ఆవిష్కరిస్తారు. తితలీ తుఫాన్‌ బాధితులకు ఇటీవల పరిహారం విడుదలైంది. ఈ సందర్భంగా తితలీ బాధితులతో, వంశధార నిర్వాసితులతో సభా ప్రాంగణంలో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం అమ్మఒడి లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన సభా వేదిక ఏర్పాట్లను నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ టి.రఘురాం, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, ఎస్పీ జీఆర్‌ రాధిక మంగళవారం పరిశీలించారు.  
 
 

Updated Date - 2022-06-22T05:03:44+05:30 IST