ఆకట్టుకున్న ఆర్ట్‌ గ్యాలరీ

ABN , First Publish Date - 2022-08-18T05:22:17+05:30 IST

కర్నాటకకు చెందిన పలువురు చిత్రకారులు బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్‌ ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న ఆర్ట్‌ గ్యాలరీ
చిత్రకళా ప్రదర్శనను తిలకిస్తున్న ప్రముఖులు

రాంనగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : కర్నాటకకు చెందిన పలువురు చిత్రకారులు బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్‌ ప్రదర్శన  పలువురిని ఆకట్టుకుంది. కన్నడ కల్చరల్‌ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో  కర్నాటక గ్రామీణ జీవన శైలిపైన శిల్పవతి, కేరళ సంప్రదాయంపైన దివ్య తదితరులు వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి.  ప్రదర్శనను నియెకర్సర్‌ డైరెక్టర్‌ బొజ్జ భిక్షమయ్య, సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజర్‌ రమణారావు ప్రారంభించారు. కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.  


Updated Date - 2022-08-18T05:22:17+05:30 IST