డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి: డీకే అరుణ
ABN , First Publish Date - 2022-05-04T03:07:03+05:30 IST
పాలమూరు ప్రజలు కేసీఆర్ను ఎంపీగా గెలిపించకుంటే తెలంగాణ వచ్చేదా..ఆయన సీఎం..
హైదరాబాద్: పాలమూరు ప్రజలు కేసీఆర్ను ఎంపీగా గెలిపించకుంటే తెలంగాణ వచ్చేదా.. ఆయన సీఎం అయ్యేవారా అని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. మంగళవారం అరుణ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టోగా రూపొందిస్తామని అరుణ తెలిపారు.