ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గం

ABN , First Publish Date - 2021-03-01T04:49:24+05:30 IST

ఆర్యవైశ్యసంఘం నగర నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం స్థానిక అమ్మవారిశాల వీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించారు.

ఆర్యవైశ్య సంఘం నూతన పాలకవర్గం

కడప(మారుతీనగర్‌), ఫిబ్రవరి 28: ఆర్యవైశ్యసంఘం నగర నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం ఆదివారం స్థానిక అమ్మవారిశాల వీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్‌ సి.ప్రసాద్‌శ్రేష్టి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్‌ శ్రేష్టి హాజరుకాగా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కె.నరసింహారావు సభకు అధ్యక్షత వహించారు. ఇదిలా ఉండగా నూతన పాలకవర్గం అధ్యక్షుడిగా మునగా శ్రీనివా్‌సకుమార్‌, ఉపాధ్యక్షులుగా టి.వెంకటసతీ్‌షకుమార్‌, పి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా వై.వి.రమణయ్య, సహాయ కార్యదర్శులుగా సి.పుల్యయ్య, పి.వెంకటరమణయ్య, జి.వెంకటనరసింహులు, టి.క్రిష్ణమూర్తి, కోశాధికారులుగా ఎం.సుమన్‌కుమార్‌, బెస్తవేముల రాంమహేష్‌తో పాటుగా కమిటీ సభ్యులుగా మరో 35 మంది ప్రమాణస్వీకారం చేశారు. 


Updated Date - 2021-03-01T04:49:24+05:30 IST