జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-09T05:25:00+05:30 IST

పట్టణానికి చెంది ఆర్యవైశ్య ప్రముఖుడు, జిల్లా ఆర్యవైశ్య మహసభ అధ్యక్షుడు కంచర్ల మాణిక్యాలరావు(జిల్లా) శుక్రవారం మృతి చెందారు.

జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కన్నుమూత

 మండపేట, మే 8: పట్టణానికి చెంది ఆర్యవైశ్య ప్రముఖుడు, జిల్లా ఆర్యవైశ్య మహసభ అధ్యక్షుడు కంచర్ల మాణిక్యాలరావు(జిల్లా) శుక్రవారం మృతి చెందారు. కొవిడ్‌ బారినపడిన ఆయన కాకినాడలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యాపారవేత్తగా సేవా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా అందరి మన్ననలు పొందారు. ఆయన మరణంతో మండపేట వ్యాపారవర్గాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన పుట్టిన రోజు మే 8కి ఒకరోజు ముందు ఆయన కన్నుమూయడాన్ని కుటుంబ సభ్యులు, మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతిపట్ల ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, డాక్టర్‌ బిక్కిన కృష్ణార్జునచౌదరి, వల్లూరినారాయణరావు,  మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పతివాడ నూక దుర్గారాణి, ఏఐసీసీ సభ్యుడు కామన ప్రభాకరరావు, యువజన కాంగ్రెస్‌ నాయకుడు శివకోటి శేషసుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ తులా శ్రీరంగారావు, ద్వారపూడి సర్పంచ్‌ ఈతకోట కిన్నెర, ఉపసర్పంచ్‌ తులా శేషారావు, ప్రముఖ వ్యాపారవేత్త కొనగొళ్ల సత్యనారాయణ (సత్తిపండు), బీజేపీ నియోజకవర్గ  ఇన్‌చార్జి కోన సత్యనారాయణ, జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, వైశ్య ప్రముఖులు సంతాపం తెలిపి  జిల్లా కుటుంబానికి సానుభూతిని తెలిపారు.

Updated Date - 2021-05-09T05:25:00+05:30 IST