పెట్రో సెస్ నిధులేమయినట్టు?

ABN , First Publish Date - 2021-11-18T09:06:49+05:30 IST

మూడు రాజధానుల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇప్పటికీ అమరావతి సెస్సును పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తూనే ఉన్నారు...

పెట్రో సెస్ నిధులేమయినట్టు?

మూడు రాజధానుల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్నారు. అయితే ఇప్పటికీ అమరావతి సెస్సును పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తూనే ఉన్నారు. మరి ఆ సెస్ ద్వారా ఇప్పటివరకు వసూలు చేసిన నిధులు ఏమయినట్టు? అమరావతిలో ఎటువంటి సహేతుక కారణాలు లేకుండా నిర్మాణాలను ఎందుకు నిలిపివేశారు? నిధులు, విభజన హామీల అమలుకు మన పార్లమెంట్ సభ్యులు ఇప్పటిదాకా పార్లమెంటులో గళం ఎత్తిన దాఖలాలు లేవు. విభజన హామీల అమలుకు ఇప్పటిదాకా మూగనోము పట్టి, కేంద్రం తెచ్చిన అనేక బిల్లులకు బేషరతుగా మద్దతు ఇచ్చి, ఇప్పుడు సదరన్ కౌన్సిల్ సమావేశంలో విభజన హామీలపై పట్టుపడతామని ప్రగల్భించటం హాస్యాస్పదంగా ఉంది. మొదటి నుంచీ ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒకలానూ, రాష్ట్రంలో మరోలానూ వ్యవహరించటం వల్లనే కేంద్రం దృష్టిలో చులకన అయ్యాం. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ఆలోచించి అమరావతినే రాజధానిగా అభివృద్ధి చెయ్యాలి. 

గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు

Updated Date - 2021-11-18T09:06:49+05:30 IST