కేటీఆర్తో అసదుద్దీన్ భేటీ
ABN , First Publish Date - 2022-03-13T01:06:44+05:30 IST
అసెంబ్లీలో మంత్రి కేటీఆర్తో ఎంపీ అసదుద్దీన్ భేటీ అయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికోసం ఎంఐఎం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్తో ఎంపీ అసదుద్దీన్ భేటీ అయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికోసం ఎంఐఎం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్తో అసదుద్దీన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ‘‘కేటీఆర్తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు. నియోజకవర్గ ప్రజాసమస్యలపై కేటీఆర్ను కలిశా. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తాం. యూపీ ఎన్నికలు మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. యూపీలో 20-80 ఫార్ములాతో ఫైట్ నడిచింది. పరీక్షలకు నెల ముందే అఖిలేష్ యాదవ్ ప్రిపేర్ అవుతారు. డిస్టింక్షన్లో పాస్ అవ్వాలంటే ఏడాది మొత్తం చదవాలి. అఖిలేష్ అలా చేయకపోవడమే ఎస్పీ ఓటమికి కారణం. తెలంగాణపై బీజేపీ ఫోకస్ అంటున్నారు కానీ.. ఇక్కడ సీఎం కేసీఆర్ గట్టిగా ఉన్నారు’’ అసదుద్దీన్ తెలిపారు.