ఎంఐఎం నాయకుడి ఇంట్లో భోజనం చేసిన అసదుద్దీన్‌ ఓవైసీ

ABN , First Publish Date - 2022-08-26T14:13:27+05:30 IST

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ బోరండలోని స్వరాజ్‌నగర్‌కు చెందిన ఎంఐఎం నాయకుడు జాహెద్‌ నివాసానికి గురువారం

ఎంఐఎం నాయకుడి ఇంట్లో భోజనం చేసిన అసదుద్దీన్‌ ఓవైసీ

హైదరాబాద్/బోరబండ: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ బోరండలోని స్వరాజ్‌నగర్‌కు చెందిన ఎంఐఎం నాయకుడు జాహెద్‌ నివాసానికి గురువారం వచ్చారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరి ఎంపీ అసదుద్దీన్‌కు స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమై జాహెద్‌ నివాసంలో భోజనం చేశారు. అక్కడ నుంచిసైట్‌ -3 చేరుకున్న ర్యాలీగా సైట్‌ -3కి చేరుకున్న ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ ఎంఐఎం ఇన్‌చార్జి అన్వర్‌ సాదత్‌, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు మహ్మద్‌ షరీఫ్‌, ఎండీ జానీమియా, వి.నర్సింగ్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-26T14:13:27+05:30 IST