తన అవసరాల కోసం బాలికను ఉపయోగించుకున్న మహిళ.. ఎన్ని దారుణాలు చేసిందంటే..

ABN , First Publish Date - 2022-05-04T22:22:20+05:30 IST

ఆ బాలిక తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మరణించారు.. దీంతో ఆ బాలిక తన బంధువుల ఇంట్లో పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది..

తన అవసరాల కోసం బాలికను ఉపయోగించుకున్న మహిళ.. ఎన్ని దారుణాలు చేసిందంటే..

ఆ బాలిక తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మరణించారు.. దీంతో ఆ బాలిక తన బంధువుల ఇంట్లో పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది.. ఆ బాలికపై అదే గ్రామంలో పని చేసే ఆశా వర్కర్ కన్నేసింది.. ఆ బాలికను ఉపయోగించుకుని తన పనులు చేసుకోవాలనుకుంది.. ఒకరోజు రాత్రి బలవంతంగా ఆ బాలికను ఓ వ్యక్తి దగ్గరకు పంపింది.. అక్కడ అతను ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఇలా రోజూ ఆ బాలికను ఎవరో ఒకరి ఇంటికి పంపేది.. ఫలితంగా ఆ బాలిక గర్భం దాలిస్తే ఇంట్లోనే అబార్షన్ కూడా చేయించింది.. చివరకు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలైంది. 


హర్యానాలోని రోహ్‌తక్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఐదేళ్ల క్రితం తన తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పట్నుంచి తన బాబాయి ఇంట్లో పనులు చేసుకుంటూ కాలం గడుపుతోంది. ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన ఆశా వర్కర్ కన్నేసింది. ఆమెను మచ్చిక చేసుకుంది. ఒకరోజు రాత్రి ఆ బాలికను ఓ యువకుడి దగ్గరకు పంపించింది. ఆ యువకుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనకు అవసరమైన వ్యక్తుల వద్దకు ఆ బాలికను ఆ మహిళ బలవంతంగా పంపించేది. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో నిందితురాలు రహస్యంగా తన ఇంటి వద్దనే ఆ బాలికకు మోటు పద్ధతిలో గర్భ స్రావం చేసింది. 


బాలిక అనారోగ్యానికి గురైనా ఆ నిందితురాలు తన పద్ధతి మార్చుకోలేదు. బాలికను బెదిరించి మరో యువకుడి దగ్గరకు పంపేందుకు ప్రయత్నించింది. ఎదురు తిరిగిన బాలికను తీవ్రంగా హింసించింది. దీంతో ఆ బాలిక మొత్తం విషయాన్ని తన కజిన్‌కు చెప్పింది. ఆ తర్వాత కజిన్ సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందిత మహిళను, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read more