కళ్యాణి డ్యామ్‌ పీటీసీ ప్రిన్సిపాల్‌గా అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-04-23T08:13:15+05:30 IST

కళ్యాణి డ్యామ్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల (పీటీసీ) ప్రిన్సిపాల్‌గా ఎంఎస్‌ఎస్‌ అశోక్‌బాబును నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కళ్యాణి డ్యామ్‌ పీటీసీ ప్రిన్సిపాల్‌గా అశోక్‌బాబు
అశోక్‌బాబు

చంద్రగిరి, ఏప్రిల్‌ 22: చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట సమీపంలో ఉన్న కళ్యాణి డ్యామ్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల (పీటీసీ) ప్రిన్సిపాల్‌గా ఎంఎస్‌ఎస్‌ అశోక్‌బాబును నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్‌గా ఉన్న సూర్యభాస్కర్‌రెడ్డి గుంటూరుకు బదిలీ కాగా.. వైస్‌ప్రిన్సిపాల్‌గా ఉన్న మునిరాజ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఏఆర్‌లో వెయిటింగ్‌ లిస్ట్‌లో ఏఎస్పీగా ఉన్న అశోక్‌బాబును ప్రిన్సిపాల్‌గా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Updated Date - 2021-04-23T08:13:15+05:30 IST