అమరావతిని రాజధానిగా గుర్తించాలి: అశోక్ గజపతి రాజు

ABN , First Publish Date - 2020-08-08T20:23:03+05:30 IST

అమరావతి: అమరావతిని రాజధానిగా గుర్తించి, రైతుల త్యాగాలను గుర్తించాలని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు డిమాండ్ చేశారు.

అమరావతిని రాజధానిగా గుర్తించాలి: అశోక్ గజపతి రాజు

అమరావతి: అమరావతిని రాజధానిగా గుర్తించి, రైతుల త్యాగాలను గుర్తించాలని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు డిమాండ్ చేశారు. కేరళలో చోటుచేసుకున్న విమాన ప్రమాదం దురదృష్టకరమన్నారు. అమరావతి, విశాఖపట్నంను డౌన్ గ్రేడ్ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూడటం మహా ఘోరమన్నారు. భోగాపురంలో 500 ఎకరాలు ఎందుకు తగ్గించారో తెలియదన్నారు. రన్ వే తగ్గించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. వృద్ధిరేటును పెంచి యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని అశోక్ గజపతి రాజు సూచించారు.


Updated Date - 2020-08-08T20:23:03+05:30 IST