ఆశ్చర్యపోయా.. ఏంటిది..? : అశోక్ గజపతిరాజు

ABN , First Publish Date - 2021-06-17T16:40:02+05:30 IST

కోర్టు తీర్పు తరువాత మాన్సాస్ ఛైర్మెన్‌గా అశోక్ గజపతిరాజు సంతకం చేశారు....

ఆశ్చర్యపోయా.. ఏంటిది..? : అశోక్ గజపతిరాజు

విజయనగరం: మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదంటే ఆశ్చర్యపోయానని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. కోర్టు తీర్పు తరువాత మాన్సాస్ ఛైర్మెన్‌గా అశోక్ గజపతిరాజు సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామన్నారు. దోపిడిదారులకు మాన్సాస్‌లో స్థానం లేదని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. రామతీర్థం విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల కరోనా నుంచి కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు. మాన్సాస్ చైర్మెన్‌గా తమ ప్రథమ ప్రాధాన్యం విద్యకేనన్నారు. దాని కోసం ప్రభుత్వ సహకారాన్ని కూడా అర్ధిస్తామన్నారు.


విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాడులు చేస్తోందని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని పట్టుకోకపోగా.. ఆలయ బాగు కోసం విరాళం ఇచ్చినా తిరస్కరించటం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. దేశంలో ఇంకా హిందూ మతం బతికుండటంతో ఆ విరాళం అయోధ్యలో సమర్పించామన్నారు. మహారాజకోటలో చారిత్రక మూలాలు ధ్వంసం చేశారన్నారు. సింహాచలం దేవస్థానం వద్ద ఆలయ ఈవో కూడా తనను కలవడానికి ఇష్ట పడలేదన్నారు. మాన్సస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-17T16:40:02+05:30 IST