ఆర్టీసీ ఛార్జీల పెంపు అశోక్ గజపతిరాజు నిరసన

ABN , First Publish Date - 2022-04-17T21:27:48+05:30 IST

ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ సమస్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపు అశోక్ గజపతిరాజు నిరసన

విజయనగరం: ఆర్టీసీ ఛార్జీల పెంపు, విద్యుత్ సమస్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ధరల్లోను, పరిపాలనలో ప్రజల భారం పోతున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజల సహనాన్ని వైసీపీ పరీక్షిస్తోందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. 


విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా చిత్తూరులో టీడీపీ నేత బాలాజీ ఆధ్వర్యంలో వినూత్న నిరసనలు తెలిపారు. బైక్‌లు, ఫ్రిజ్‌లను శవయాత్రగా శ్మశానవాటికకు తీసుకెళ్లి టీడీపీ శ్రేణులు దహనం చేశాయి.

Updated Date - 2022-04-17T21:27:48+05:30 IST