కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన అశోక్ గజపతిరాజు

ABN , First Publish Date - 2022-05-02T21:30:16+05:30 IST

మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన అశోక్ గజపతిరాజు

విజయనగరం: మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఒక మంత్రేమో జెనరేటర్లు ఆన్ చేశామంటారు.. తెలంగాణ వాళ్లేమో బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ అంటారు. ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్‌కి పనికొస్తుంది తప్పా ఇంకేం లేదు. ప్రజలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది’’ అశోక్ గజపతిరాజు తప్పుబట్టారు.


ఏపీలో కరెంట్‌, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని మంత్రి కేటీఆర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారన్నారు. అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని కేటీఆర్ చెప్పారు.



Updated Date - 2022-05-02T21:30:16+05:30 IST