సింహాచలం ఈవో ఇప్పటివరకు కలవలేదు: అశోక్ గజపతిరాజు
ABN , First Publish Date - 2021-06-21T01:29:20+05:30 IST
సింహాచలం ఈవో ఇప్పటివరకు కలవలేదు: అశోక్ గజపతిరాజు
విజయనగరం: హిందువుల ఆచారాలు, ఆస్తులు, ఆలయాలపై ఏపీ సర్కారు దాడులు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతి రాజు అన్నారు. సింహాచలంలో జరిగిన అవమానం వ్యక్తిగతంగా తనకు జరిగిన నష్టం కాదన్నారు. అధికారుల తీరు సరైనది కాదని చెప్పారు. జగన్ సర్కారుకు మంచి బుద్ది కలగాలని పైడి తల్లి అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.జైలికి వెళ్లొచ్చిన విజయసాయి రెడ్డికి అందరు దొంగలుగానే కనపడతారన్నారు. మాన్సస్లో తాను చేసిన అక్రమాలేమిటో ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా సింహాచలం ఈవో ఇప్పటివరకు తనకు కలవలేదన్నారు. సంచయితకు ఇక్కడ ఎన్ని హక్కులు వున్నాయో చెప్పటానికి సోషల్ మీడియోలో ఆమె పెట్టిన పోస్టులు చాలని అశోక్ గజపతిరాజు ఎద్దేవా చేశారు.