జట్టుతో చేరిన అశ్విన్
ABN , First Publish Date - 2022-06-24T09:34:23+05:30 IST
ఆఫ్స్పిన్నర్ ఆర్. అశ్విన్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ..
న్యూఢిల్లీ: ఆఫ్స్పిన్నర్ ఆర్. అశ్విన్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం లీసెస్టర్లో ఉన్న జట్టుతో పాటే చేరాడు. అయితే ఫిట్నెస్ లేని కారణంగా గురువారం నుంచి జరుగుతున్న వామప్ మ్యాచ్కు దూరంగానే ఉన్నాడని, ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని బోర్డు వర్గాలు తెలిపాయి.