గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
ABN , First Publish Date - 2021-06-17T06:19:37+05:30 IST
:రాజాపేట పోలీస్స్టేషన్ ఏఎస్ఐ ప్రతికంఠం సీతారామరాజు(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.
రాజాపేట, జూన్ 16:రాజాపేట పోలీస్స్టేషన్ ఏఎస్ఐ ప్రతికంఠం సీతారామరాజు(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మండలంలోని పొటి ్టమర్రి చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తూ గుండెపోటు రావడంతో ఆయన్ను, చికిత్స నిమిత్తం భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఆయన మూడున్నరేళ్లుగా ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. సీతారామరాజు స్వస్థలం తిరుమలగిరి (సాగర్) మండలం రాజవరం. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.