భారత అమ్మాయిలకు స్వర్ణం

ABN , First Publish Date - 2020-10-27T09:14:47+05:30 IST

ఆసియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టు స్వర్ణం, పురుషుల బృందం రజత పతకాలను

భారత అమ్మాయిలకు స్వర్ణం

ఆసియా ఆన్‌లైన్‌ టీమ్‌ చెస్

న్యూఢిల్లీ: ఆసియా నేషన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత మహిళల జట్టు స్వర్ణం, పురుషుల బృందం రజత పతకాలను గెలుపొందాయి. టోర్నీ ఆరంభం నుంచే అదరగొడుతున్న భారత అమ్మాయిలు ఫైనల్లోనూ అదే ఉత్సాహం కనబర్చి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఇండోనేసియాతో జరిగిన ఫైనల్లో భారత్‌ 6-2తో విజయం సాధించింది. గ్రాండ్‌మాస్టర్‌ పీవీ నందిదా, ఐఎం పద్మినీ రౌత్‌ భారత విజయంలో ముఖ్యభూమిక పోషించారు. ఇక, ఫైనల్‌ చేరిన భారత పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత్‌ 3.5-4.5 తేడాతో ఓడిపోయింది. టాప్‌ బోర్డులో ఆడిన సీనియర్లు భాస్కరన్‌ అధిబన్‌, సేతురామన్‌కు పరాజయాలు ఎదురవడంతో భారత్‌కు స్వర్ణం దూరమైంది.

Updated Date - 2020-10-27T09:14:47+05:30 IST