ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని దేవున్ని కోరుకోండి

ABN , First Publish Date - 2022-06-26T04:40:43+05:30 IST

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని ఆ దేవున్ని అందరూ వేడుకోవాల ని, ఇచ్చిన హామీల్లో ఈ మూడే ళ్లలో 95 శాతం మాత్రమే పూర్తి చేశామని, ఆర్థిక పరిస్థితి మెరు గు పడితే దుల్హాన్‌ సహా మిగిలి న 5 శాతంలో రైతులకు ఉపయోగపడే డ్రిప్‌ ఇరిగేషన్‌ కూడా అమలు చేస్తామని మంత్రి అంజ ద్‌ బాష పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని దేవున్ని కోరుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం

వంద శాతం దుల్హాన్‌ అమలు చేస్తాం

త్వరలో డ్రిప్‌ ఇరిగేషన్‌ : మంత్రి అంజద్‌బాష

మైదుకూరు, జూన్‌ 25: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని ఆ దేవున్ని అందరూ వేడుకోవాల ని, ఇచ్చిన హామీల్లో  ఈ మూడే ళ్లలో 95 శాతం మాత్రమే పూర్తి చేశామని, ఆర్థిక పరిస్థితి మెరు గు పడితే దుల్హాన్‌ సహా మిగిలి న 5 శాతంలో రైతులకు ఉపయోగపడే డ్రిప్‌ ఇరిగేషన్‌ కూడా అమలు చేస్తామని మంత్రి అంజ ద్‌ బాష పేర్కొన్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలో జరుగుతున్న అభివద్ధిని చూసి ఒర్వలేక దగా ప్రభుత్వం అంటూ నేతలు విమర్శిస్తున్నారని, రాష్ట్రంలో రైతు అవసరాలను తీర్చేది జగన్‌ ప్రభుత్వమేనన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండా పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఏ ఒక్క రి పొత్తు లేకుండానే వైసీపీనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, కడప నగర మేయర్‌ సురే్‌షబాబు, ఆర్టీసీ ఛైర్మెన్‌ మల్లికార్జునరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ సలహామండలి ఛైర్మన్‌ సంబటూరు ప్రసాదరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ మాచనూరు చంద్ర, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T04:40:43+05:30 IST