నిశ్శబ్దంగా ఉండమన్న డాక్టరుపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2021-04-22T21:31:16+05:30 IST

నిశ్శబ్దంగా ఉండమన్నందుకు ఓ వ్యక్తి డాక్టరుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ముంబైలోని నాందేడ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

నిశ్శబ్దంగా ఉండమన్న డాక్టరుపై కత్తితో దాడి

ముంబై: నిశ్శబ్దంగా ఉండమన్నందుకు ఓ వ్యక్తి  డాక్టరుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా సోకిన తన బంధువుని చూసేందుకు భాసాహెబ్ గైక్వాడ్ ఆసుపత్రికి వచ్చాడు. కొవిడ్ వార్డులో గైక్వాడ్ గట్టిగా అరుస్తూ మాట్లాడడం పక్కన రోగులకు ఇబ్బంది కలిగించింది. డాక్టర్ జోక్యం చేసుకొని సదరు వ్యక్తిని నిశ్శబ్దంగా ఉండాలని సూచించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గైక్వాడ్ కత్తి తీసుకొని డాక్టర్‌పై దాడి చేస్తుండగా ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. ఈ గొడవలో డాక్టరుకు స్వల్పగాయలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని తెలిపారు. 


Updated Date - 2021-04-22T21:31:16+05:30 IST