41 మందికి నియామకపత్రాల అందజేత
ABN , First Publish Date - 2020-11-27T05:07:07+05:30 IST
మహి ళల సంరక్షణ కోసం గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు కృషి చేయాలని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బ రాజు అన్నారు.
ఏలూరు క్రైం, నవంబరు 26: మహి ళల సంరక్షణ కోసం గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు కృషి చేయాలని అదనపు ఎస్పీ ఏవీ సుబ్బ రాజు అన్నారు. నూతనంగా ఎంపికైన మహిళా సంరక్షణ కార్యదర్శులు 41 మందికి జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నియామకపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్, పలువురు పోలీసులు అధికారులు పాల్గొన్నారు.