వేధింపుల పీవోను అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2021-06-22T04:52:41+05:30 IST
కేఆర్.పురం ఐటీడీఏ పీవోగా పనిచేసిన ఆర్వి సూర్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పి) రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు డిమాండ్ చేశారు.
బుట్టాయగూడెం, జూన్ 21: కేఆర్.పురం ఐటీడీఏ పీవోగా పనిచేసిన ఆర్వి సూర్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పి) రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు డిమాండ్ చేశారు. సింగన్నపల్లిలో ఆదివాసీ జేఎసీ చైర్మన్ మొడియం శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడిన పీవోపై ఎస్సీ, ఎస్టీ, నిర్భయ, దిశ చట్టం ప్రకారం విచారణ జరిపి ఉరిశిక్ష వేస్తేనే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు, 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలోజు నాగేశ్వరావు, కారం వెంకటేశ్వరావు, సోదెం మల్లయ్య, తెల్లం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.