సత్వర న్యాయం అందిస్తా : ఏఎస్పీ

ABN , First Publish Date - 2022-06-28T07:05:38+05:30 IST

మచిలీపట్నం టౌన్‌ : ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఏఎస్పీ ఎన్‌. వెంకట రామాంజనేయులు అన్నారు. స్పందనలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

సత్వర న్యాయం అందిస్తా : ఏఎస్పీ

మచిలీపట్నం టౌన్‌ : ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని  ఏఎస్పీ ఎన్‌. వెంకట రామాంజనేయులు అన్నారు. స్పందనలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. తనకు సంవత్సరం క్రితం వివాహమైందని,  కుటుంబ జీవితానికి పనికిరాడని తెలిసీ వివాహం జరిపించారని, ఇదేమని అడిగితే దాడికి దిగుతున్నారని అవనిగడ్డకు చెందిన ఒక వివాహిత ఫిర్యాదు చేసింది. తన భార్య అకారణంగా తనపై తప్పుడు కేసులు బనాయిస్తోందని కంకిపాడుకు చెందిన రాజు ఫిర్యాదు చేశారు. తన ఇంటి ఎదురు రోడ్డును ఎదురింటి వారు ఆక్రమించి నడిచేందుకు వీలు లేకుండా చేశారని,  అడిగితే దాడులకు దిగుతున్నారని పెదపారుపూడికి చెందిన పవన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తనకున్న భూమిని తోడబుట్టిన వారికి కౌలుకిచ్చామని, కౌలు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బంటుమిల్లి చెందిన సుబ్బయ్య అనే రైతు ఫిర్యాదు చేశారు.


Updated Date - 2022-06-28T07:05:38+05:30 IST