అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులే
ABN , First Publish Date - 2022-01-06T13:47:35+05:30 IST
రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండు రోజులపాటు నిర్వహించాలని అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు సభాపతి అప్పావు ప్రకటించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 6,
- సభాపతి అప్పావు ప్రకటన
చెన్నై: రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండు రోజులపాటు నిర్వహించాలని అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు సభాపతి అప్పావు ప్రకటించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 6, 7 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుందన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్దతుగా ప్రసంగించడంతో సమావేశాలు ముగుస్తాయని తెలి పారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే మాజీ శాసనసభ్యుల మృతికి సంతాపం తెలుపుతామని, ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న కారణంగానే శాసనసభ సమావేశాలను రెండు రోజులపాటే జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్ధతుగా ముఖ్యమంత్రి స్టాలిన్ చేసే ప్రసంగాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని అప్పావు తెలిపారు. రెండు రోజులపాటు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగే ప్రశ్నలు, వాటికి ఆయా మంత్రులు ఇచ్చే సమాధానాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.