పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు అప్పగించండి
ABN , First Publish Date - 2021-07-30T05:25:45+05:30 IST
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004లో ఎస్ఎంపురం గ్రామానికి చెందిన 160మందికి సర్వే నెంబరు 112లో పట్టా లు ఇచ్చారని, వీరందరికీ ఆ స్థలాలను అప్పగించాలని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి కోరారు.
ఎచ్చెర్ల:కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004లో ఎస్ఎంపురం గ్రామానికి చెందిన 160మందికి సర్వే నెంబరు 112లో పట్టా లు ఇచ్చారని, వీరందరికీ ఆ స్థలాలను అప్పగించాలని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి కోరారు. దీనిపై గురువారం తహసీల్దార్ సనపల సుధాసాగర్కు వినతిపత్రం అందజేశారు. ఫ ఎస్ఎస్ఆర్పురం పంచాయతీ చినరావుపల్లి గ్రా మంలో సర్వేనెంబరు 17/5లో 1.88 ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమికి గతంలో ఇచ్చిన ఎన్వోసీ (నో అబ్జక్షన్ సర్టిఫికేట్) రద్దు చేయాలని పలువురు తహసీల్దార్ సుధాసాగర్కు గురువారం వినతిపత్రం అందజేశారు. గతంలో గ్రామస్థుల ఎవరికీ తెలియకుండా ఎటువంటి గ్రామసభ నిర్వహించ కుండా ఓ విద్యా సంస్థకు ప్రభుత్వ భూమినికట్టబెట్టారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.